
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కొడిమ్యాల,వెలుగు: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కొడిమ్యాల మండలకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా యాత్రలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సుమారు 2వేల మంది రైతులు, ప్రజలు, కార్యకర్తలతో బస్టాండ్ నుంచి అంగడి బజార్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. కల్లాల్లో కటింగ్ల పేరిట అడ్డగోలు దోపిడీకి పాల్పడిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజనర్సింగరావు, ముత్యం శంకర్, తదితరులు
పాల్గొన్నారు.
మల్యాల, వెలుగు: మల్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ వసంత, కాంగ్రెస్ నాయకులు ఆనంద రెడ్డి, రాంలింగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.